తెలంగాణ అసెంబ్లీ వద్ద పీఈటీ అభ్యర్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-01T19:35:48+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గురుకులాల పీఈటీ అభ్యర్థులు...

తెలంగాణ అసెంబ్లీ వద్ద పీఈటీ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గురుకులాల పీఈటీ అభ్యర్థులు అసెంబ్లీని ముట్టడించారు. ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా తమకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయినా పోస్టింగ్ ఇవ్వడంలో అలసత్వం ఎందుకని ప్రశ్నించారు. కుటుంబసభ్యులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి తరలి వచ్చారు. ఇప్పటికే పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్‌ను పదిసార్లు ముట్టడించారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జిల్లాల నుంచి అభ్యర్థులు వచ్చారు. అయితే అభ్యర్థులతోపాటు వాళ్ల కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2021-10-01T19:35:48+05:30 IST