24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2021-09-17T23:21:30+05:30 IST

ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు బీఏసీ సమావేశం కానుంది. సమావేశ పనిదినాలు, ఎజెండాను బీఏసీ ఖరారు చేయనుంది. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై ఒకట్రెండు రోజుల్లో గవర్నర్‌ తమిళ సైని కేసీఆర్ కేసీఆర్ కలవనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో కేసీఆర్  చర్చించనున్నారు.

Updated Date - 2021-09-17T23:21:30+05:30 IST