కృష్ణానదిని తెలంగాణ, ఏపీ రెండూ పంచుకోవాల్సి ఉంది: బైరెడ్డి
ABN , First Publish Date - 2020-05-24T01:49:06+05:30 IST
కృష్ణానదిని తెలంగాణ, ఏపీ రెండూ పంచుకోవాల్సి ఉందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఏపీ, తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తే మంచిదని అభిప్రాయపడ్డారు.
కర్నూలు: కృష్ణానదిని తెలంగాణ, ఏపీ రెండూ పంచుకోవాల్సి ఉందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఏపీ, తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తే మంచిదని అభిప్రాయపడ్డారు. తుంగభద్రను కృష్ణానదిలో కలిపి సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడుపై సీఎం జగన్ గ్రౌండ్ వర్క్ చేసినట్టు లేదని విమర్శించారు. జీవో ఇచ్చేముందు తెలంగాణను దృష్టిలో పెట్టుకోవాల్సిందన్నారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి జీవో ఇచ్చిఉంటే వివాదం వచ్చేది కాదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు.