LIVE : ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధం

ABN , First Publish Date - 2020-08-13T13:14:06+05:30 IST

ఏపీ, తెలంగాణ మధ్య నీటికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. రాయలసీమ లిఫ్ట్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.

LIVE : ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధం

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య నీటికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. రాయలసీమ లిఫ్ట్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాయలసీమ లిఫ్ట్ అక్రమమంటూ తెలంగాణ వాదిస్తోంది.  రాయలసీమ లిఫ్ట్ మాకు న్యాయం రావాల్సిన వాటా, న్యాయంగా రావాల్సిన నీటిని తీసుకోవడం కోసం కడుతున్న ప్రాజెక్టే...కొత్త ప్రాజెక్ట్ కాదు కాబట్టి అదేమీ అక్రమం కాదు అని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉంది...రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటున్నారు...కలిసి సమస్యను పరిష్కరించుకోవచ్చు.


కానీ ఎందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోకుండా సమస్యను జఠిలం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ అంశాన్ని వివాదం చేస్తున్నారు. కావాలనే వివాదాన్ని ఇంకా పెద్దదిగా చేస్తున్నారు అనేది రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో నిర్వహించిన చర్చలో ఏపీ ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ టి.లక్ష్మీనారాయణ, తెలంగాణ ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ కొండపల్లి వేణుగోపాల్, టీడీపీ నేత చంగల్ రాయుడు, కాంగ్రెస్ నేత వంశీచంద్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-08-13T13:14:06+05:30 IST