AP: Telangana మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-09T12:28:42+05:30 IST

తెలంగాణ మద్యం రవాణా చేసినా, నాటుసారా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో

AP: Telangana మద్యం స్వాధీనం

కృష్ణా: తెలంగాణ మద్యం రవాణా చేసినా, నాటుసారా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బూరుగగూడెం గ్రామానికి చెందిన అయ్యంకి బాలస్వామి తెలంగాణ నుంచి తెచ్చి అమ్ముతున్న రూ.68 వేలు విలువైన 524 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మైలవరం సీఐ పి.శ్రీను, రెడ్డిగూడెం ఎస్సై డి.ఆనంద్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T12:28:42+05:30 IST