Presidential Election 2022: తేజస్వీ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-07-18T21:48:06+05:30 IST
పాట్నా: ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టక ముందు నిత్యానంద్ రాయ్ తనను కలిశారని, తనను ఆర్జేడీలోకి తీసుకోవాలని కోరారని గుర్తు చేశారు.
పాట్నా: రాష్ట్రపతి ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత tejashwi yadav సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టక ముందు nityanand rai తనను కలిశారని, తనను ఆర్జేడీలోకి తీసుకోవాలని కోరారని గుర్తు చేశారు. తనకు బీజేపీలో చేరాలని లేదని కూడా నిత్యానంద్ రాయ్ చెప్పారని తేజస్వీ వెల్లడించారు. నిత్యానంద్ రాయ్ ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు బీహార్ అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి Draupadi Murmuను ఎన్నుకోబోమని స్పష్టం చేశారు. బీజేపీకి ఆదివాసీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవాలని, అంతేకానీ ముర్ముకు మద్దతివ్వమంటే కుదరదని తేల్చి చెప్పారు. ముర్మును ఆయన విగ్రహంతో పోల్చి మాట్లాడారు. ముర్ము ఇప్పటివరకూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించకపోవడాన్ని తేజస్వీ తప్పుబట్టారు. విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా విలేకరుల సమావేశం పెట్టి తన మనసులో మాటను బయటపెట్టారని తేజస్వీ గుర్తు చేశారు.