తేజ‌స్వీ, ప‌శుప‌తిల ఆచూకీ చెబితే రూ. 51 వేలు!

ABN , First Publish Date - 2021-05-15T16:04:02+05:30 IST

ఇద్ద‌రు ప్ర‌ముఖ నేత‌లు అదృశ్య‌మ‌య్యారంటూ...

తేజ‌స్వీ, ప‌శుప‌తిల ఆచూకీ చెబితే రూ. 51 వేలు!

ప‌ట్నా: ఇద్ద‌రు ప్ర‌ముఖ నేత‌లు అదృశ్య‌మ‌య్యారంటూ బీహార్‌లోని రాఘోపూర్ పరిధిలో గ‌ల‌ వివిధ పంచాయతీల వీధుల్లోని గోడలపై పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ పోస్టర్‌లో రాఘోపూర్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్, హాజీపూర్ ఎంపీ పశుపతి కుమార్ పరాస్  క‌నిపించ‌డం లేదంటూ  పేర్కొన్నారు.  ఈ పోస్టర్లు ఎప్పుడు అతికించారోగానీ, ఈ నేత‌లు ఎన్నికల్లో గెలిచిన తరువాత నుంచి నియోజకవర్గాలలో క‌నిపించ‌డంలేదంటూ ఈ పోస్ట‌ర్ల‌లో తెలియ‌జేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలోనూ ఈ నేత‌లు ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు గురించి ప‌ట్టించుకోవ‌డంలేద‌ని పోస్ట‌ర్ల‌లో తెలియ‌జేశారు. ఈ నేత‌ల ఆచూకీ తెలిపిన వారికి కానుక‌గా రూ. 5100 రూపాయలు ఇస్తామ‌ని ఆపోస్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు.  ఈ నేతలు ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌మ‌ను క‌లిశార‌ని, త‌రువాత ఒక్క‌సారి కూడా నియోజ‌క‌వ‌ర్గానికి రాలేద‌ని గ్రామ ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-05-15T16:04:02+05:30 IST