ఎన్నికలొస్తున్నాయని మధురలో తేజ్ ప్రదక్షిణలు
ABN , First Publish Date - 2020-07-06T17:22:52+05:30 IST
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో మరోసారి యూపీలోని బ్రజ్భూమిని ...
మధుర: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో మరోసారి యూపీలోని బ్రజ్భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో రాధే ... రాధే అని రాయడంతో పాటు బ్యాంకే బిహారీ లాల్ కీ జై అనే నినాదం రాసి, ఒక వీడియోను షేర్ చేశారు. బ్రజ్తో తేజ్ప్రతాప్ యాదవ్ ఎప్పటి నుంచో అనుబంధం ఏర్పరుచుకున్నారు. తాజాగా తేజ్.. బ్రజ్లో ఒక వారం రోజులపాటు ఉండి, అక్కడి పవిత్ర స్థలాలను సందర్శించారు. అదేవిధంగా బీహార్లో ఈ ఏడాది చివరిలోపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై కూడా దృష్టి పెట్టారు. 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.