లండన్ మహిళతో ఖమ్మం ఉద్యోగి ఫేస్బుక్ పరిచయం.. చివరికి..
ABN , First Publish Date - 2021-03-23T18:08:32+05:30 IST
ఫేస్ బుక్ పరిచయం ఓ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి కొంపముంచింది. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా కారేపల్లి రెవెన్యూ సీనియర్ ...
ఖమ్మం: ఫేస్బుక్ పరిచయం ఓ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి కొంపముంచింది. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా కారేపల్లి రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్గా పని విధులు నిర్వహిస్తున్న సుధీర్.. నెల రోజుల క్రితం రోస్లీ నికోలస్ అనే లండన్ మహిళతో ఫేస్బుక్లో ప్రెండ్ రిక్వస్ట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అప్పటి నుంచి ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. అయితే కొద్దీ రోజుల క్రితం రోస్లీ నికోలస్ మీ పేరు మీద రూ.50 వేల డాలర్లు పంపించారని, తాను కస్టమ్స్ అధికారినని కవితా శర్మ సుధీర్కు కాల్ చేసి తనతో పరిచయం ఏర్పరచుకుంది.
అయితే.. కొన్ని రోజులుగా ఇద్దరు ఆన్లైన్లో చాటింగ్ చేసుకున్నారు. ఒకరోజు తాను ఇండియా రావాలనుకుంటానని.. అయితే ఆదాయ ట్యాక్స్తో పాటు ఇతర ఖర్చులు ఉంటాయని మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుంది. దీంతో సుధీర్ దగ్గర రూ.10 లక్షల 72 వేల 500లను కవితా శర్మ తన వేర్వేరు ఖాతాల్లో డబ్బులు వేయించుకుంది. అయితే.. ఇప్పటికీ డాలర్ల సొమ్ము సుధీర్కు రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే సుధీర్ తన ఫోన్ నుంచి కవితా శర్మకు కాల్ చేసి.. డాలర్లు వద్దు తన డబ్బులు రిటర్న్ చేయమని కోరాడు. అలా కుదరదని చెప్పి.. చివరగా ఇంకో లక్ష అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో ఆమె చేతిలో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు (రెవెన్యూ ఉద్యోగి) సోమవారం పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం తెలిపాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.