వీఆర్వోపై తహసీల్దారు విచారణ

ABN , First Publish Date - 2021-05-07T04:55:27+05:30 IST

డమడక వీఆర్వో చంద్రశేఖ ర్‌పై గురువారం తహసీల్దారు దామోదర్‌ విచార ణ చేపట్టారు. ప్రతి పనికీ ఒరేటు నిర్ణయించి పనులు చేస్తున్నారని గ్రామస్తుల ఆరోపణపై తహసీల్దారు స్వయంగా గ్రామంలోకి వచ్చి విచా రణ చేపడితే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

వీఆర్వోపై తహసీల్దారు విచారణ
ఇడమడక ప్రజలను విచారిస్తున్న తహసీల్దారు దామోదర్‌రెడ్డి

దువ్వూరు, మే 6: ఇడమడక వీఆర్వో చంద్రశేఖ ర్‌పై గురువారం తహసీల్దారు దామోదర్‌ విచార ణ చేపట్టారు. ప్రతి పనికీ ఒరేటు నిర్ణయించి పనులు చేస్తున్నారని గ్రామస్తుల ఆరోపణపై తహసీల్దారు స్వయంగా గ్రామంలోకి వచ్చి విచా రణ చేపడితే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. గ్రామంలో ఉండరని, సమస్యలు పరి ష్కరించాలని కోరితే డబ్బు వసూలు చేస్తున్నాడ ని ఫిర్యాదులో తెలిపారు.

ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు మంజూరుకు జాప్యం చేస్తున్నారని, రేషనకార్డులు, భూముల ఆనలైన, డెత సర్టిఫికె ట్లు, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు కావాల న్నా డబ్బు వసూలు చేయడమే కాకుండా పనులు చేయలేదని ప్రజలు తహసీల్దారుకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నెల్లూరు నరేంద్ర రేషన్‌ కార్డు కోసం మూడు నెలలుగా తిరుగు తున్నా కార్డు ఇవ్వలేదన్నారు.

రేషన కార్డు ఉంటే తప్ప జాబ్‌కార్డు రాదని అధికారులు తెలుపుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై తహసీ ల్దారు ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గ్రామస్థుల ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించామ న్నారు. సమగ్ర నివేదికను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.

Updated Date - 2021-05-07T04:55:27+05:30 IST