ఇసుక కోసం అనుమతి తీసుకోవాలి: తహసీల్దార్
ABN , First Publish Date - 2020-09-25T10:26:39+05:30 IST
ఇసుక కోసం అనుమతి తీసుకోవాలి: తహసీల్దార్
చిన్నంబావి, సెప్టెంబరు 24: గ్రామాల్లో నిర్మించే రైతువేదికలు, వైకుంఠధామాలకు ఇసుక అను మతి కోసం తమ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలని తహసీల్దార్ శాంతిలాల్ అన్నారు. స్థాని కంగా గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.