నేను ఏ దళితుడిని కించపర్చలేదు: తీన్మార్ మల్లన్న

ABN , First Publish Date - 2021-09-16T02:24:35+05:30 IST

"నేను ఏ దళితుడిని కించపర్చలేదు"ని తీన్మార్

నేను ఏ దళితుడిని కించపర్చలేదు:  తీన్మార్ మల్లన్న

నల్గొండ: "నేను ఏ దళితుడిని కించపర్చలేదు" అని తీన్మార్ మల్లన్న అన్నారు. తన భార్యే దళితురాలని మల్లన్న పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కోర్టుకు తీన్మార్ మల్లన్న హాజరయ్యాడు. అడ్డగూరు పీఎస్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మల్లన్నను జిల్లా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు.  తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడనన్నారు. తప్పుడు కేసులు పెడుతూ కోర్టులో ప్రభుత్వం  భంగపాటుకు గురవుతుందన్నారు. హుజురాబాద్‌లో ఎలాగైనా గెలవాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన ఆరోపించారు. కోర్టుల ద్వారా తమకు న్యాయం అందుతుందని మల్లన్న అన్నారు. 

Updated Date - 2021-09-16T02:24:35+05:30 IST