తల్లిపై కోపంతో 8 నెలల పసికందు హత్య.. చేసిందెవరో తెలిసి అంతా షాక్

ABN , First Publish Date - 2022-05-12T08:36:32+05:30 IST

పొరుగింట్లో నివసించే ఒక మహిళపై ఏదో విషయంలో కోపం వచ్చింది. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు అతను. దానికోసం పక్కా ప్లాన్ వేసి ఇంట్లో ఎవరూ లేనప్పుడు 8 నెల వయసున్న ఆమె బాబును తీసుకెళ్లి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో ముంచి హత్య చేశాడు...

తల్లిపై కోపంతో 8 నెలల పసికందు హత్య.. చేసిందెవరో తెలిసి అంతా షాక్

పొరుగింట్లో నివసించే ఒక మహిళపై ఏదో విషయంలో కోపం వచ్చింది. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు అతను. దానికోసం పక్కా ప్లాన్ వేసి ఇంట్లో ఎవరూ లేనప్పుడు 8 నెల వయసున్న ఆమె బాబును తీసుకెళ్లి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో ముంచి హత్య చేశాడు. ఈ దుర్మార్గమైన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.


నీళ్ల ట్యాంకులో ఎనిమిది నెలల పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పొరుగింట్లో ఉండే ఒక 13 ఏళ్ల బాలుడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతన్ని తీసుకెళ్లి విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆ పసికందు తల్లి.. ఆ బాలుడిని ఏదో విషయంలో తిట్టింది.

దీంతో కోపం తెచ్చుకున్న ఆ పిల్లాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె పిల్లల్లో అందరి కన్నా చిన్నవాడైన పసికందును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే పిల్లాడిని ఎత్తుకెళ్లి ఇంటిపైన ఉన్న నీళ్ల ట్యాంకులో ముంచి చంపేశాడు. పోలీసు విచారణలో ఆ పిల్లాడు నేరం ఒప్పుకోవడంతో అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


Read more