-
-
Home » Prathyekam » Teenager drowns infant in water tank over tiff with mother abdl spl-NGTS-Prathyekam
-
తల్లిపై కోపంతో 8 నెలల పసికందు హత్య.. చేసిందెవరో తెలిసి అంతా షాక్
ABN , First Publish Date - 2022-05-12T08:36:32+05:30 IST
పొరుగింట్లో నివసించే ఒక మహిళపై ఏదో విషయంలో కోపం వచ్చింది. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు అతను. దానికోసం పక్కా ప్లాన్ వేసి ఇంట్లో ఎవరూ లేనప్పుడు 8 నెల వయసున్న ఆమె బాబును తీసుకెళ్లి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో ముంచి హత్య చేశాడు...
పొరుగింట్లో నివసించే ఒక మహిళపై ఏదో విషయంలో కోపం వచ్చింది. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు అతను. దానికోసం పక్కా ప్లాన్ వేసి ఇంట్లో ఎవరూ లేనప్పుడు 8 నెల వయసున్న ఆమె బాబును తీసుకెళ్లి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో ముంచి హత్య చేశాడు. ఈ దుర్మార్గమైన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
నీళ్ల ట్యాంకులో ఎనిమిది నెలల పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పొరుగింట్లో ఉండే ఒక 13 ఏళ్ల బాలుడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతన్ని తీసుకెళ్లి విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆ పసికందు తల్లి.. ఆ బాలుడిని ఏదో విషయంలో తిట్టింది.
దీంతో కోపం తెచ్చుకున్న ఆ పిల్లాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె పిల్లల్లో అందరి కన్నా చిన్నవాడైన పసికందును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే పిల్లాడిని ఎత్తుకెళ్లి ఇంటిపైన ఉన్న నీళ్ల ట్యాంకులో ముంచి చంపేశాడు. పోలీసు విచారణలో ఆ పిల్లాడు నేరం ఒప్పుకోవడంతో అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.