metroకు సాంకేతిక చికాకు

ABN , First Publish Date - 2022-05-25T16:49:14+05:30 IST

సాంకేతిక సమస్యలతో మెట్రోరైళ్లలో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మియాపూర్‌- ఎల్‌బీనగర్‌ కారిడార్‌లో మంగళవారం మధ్యాహ్యం మూసారాంబాగ్‌

metroకు సాంకేతిక చికాకు

మూసారాంబాగ్‌ స్టేషన్‌లో నిలిచిన మెట్రోరైల్‌

హైదరాబాద్‌ సిటీ/ సైదాబాద్‌: సాంకేతిక సమస్యలతో మెట్రోరైళ్లలో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మియాపూర్‌- ఎల్‌బీనగర్‌ కారిడార్‌లో మంగళవారం మధ్యాహ్యం మూసారాంబాగ్‌ స్టేషన్‌ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో సు మారు 5 నుంచి 10 నిమిషాల పాటు మెట్రోరైలు నిలిచిపోయింది. దీంతో రెడ్‌లైన్‌ మార్గంలో (మియాపూర్‌- ఎల్‌బీనగర్‌) ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యతో మెట్రోరైలు నిలిచిపోయినట్లు తెలిసింది. ప్రయాణికుల పెం పుపై దృష్టి సారించిన అధికారులు సాంకేతిక సమస్యలపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. మంగళవారం తలెత్తిన సమస్యను అధికారులు అధికారికరంగా ప్రకటించలేదు.

Updated Date - 2022-05-25T16:49:14+05:30 IST