ఆల్టియోస్టార్‌లో వాటా విక్రయించిన టెక్‌ మహీంద్రా అనుబంధ సంస్థ

ABN , First Publish Date - 2020-09-24T06:09:40+05:30 IST

ఆల్టియోస్టార్‌ నెట్‌వర్క్స్‌లో టెక్‌ మహీంద్రా అనుబంధ విభాగానికి చెందిన 1.85 కోట్ల షేర్లను రకుటేన్‌ యూఎ్‌సఏ ఇంక్‌ అనే సంస్థ 4.5 కోట్ల డాలర్ల(సుమారు రూ.331 కోట్లు)కు కొనుగోలు చేసింది.

ఆల్టియోస్టార్‌లో వాటా విక్రయించిన టెక్‌ మహీంద్రా అనుబంధ సంస్థ

రూ.331 కోట్లకు కొనుగోలు చేసిన రకుటేన్‌ 


న్యూఢిల్లీ: ఆల్టియోస్టార్‌ నెట్‌వర్క్స్‌లో టెక్‌ మహీంద్రా అనుబంధ విభాగానికి చెందిన 1.85 కోట్ల షేర్లను రకుటేన్‌ యూఎ్‌సఏ ఇంక్‌ అనే సంస్థ 4.5 కోట్ల డాలర్ల(సుమారు రూ.331 కోట్లు)కు కొనుగోలు చేసింది. దేశీయ ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా పూర్తి అనుబంధ సంస్థ టెక్‌ మహీంద్రా(అమెరికాస్‌) ఇంక్‌.. ఈ షేర్లను రకుటేన్‌కు విక్రయించింది. ఆల్టియోస్టార్‌లోని మైనారిటీ పెట్టుబడి తమ కంపెనీ టర్నోవర్‌, ఆదాయం, లాభాలకు ఏ విధంగానూ దోహదపడటం లేదని టెక్‌ మహీంద్రా పేర్కొంది. రకుటేన్‌ మొబైల్‌, టెక్‌ మహీంద్రా మధ్య మరో ఒప్పందం కుదిరింది. రకుటేన్‌ మొబైల్‌కు టెక్‌ మహీంద్రా ప్రాధాన్య భాగస్వామిగా వ్యవహరించడంతోపాటు టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ సమకూర్చనుంది.

Updated Date - 2020-09-24T06:09:40+05:30 IST