స్మార్ట్ఫోన్కు బ్యాండు బాజాల మధ్య.. గుర్రపు బండిపై ఊరేగింపు.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..
ABN , First Publish Date - 2021-12-23T02:54:32+05:30 IST
ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రూ.12,500 ఖరీదు చేసే ఫోన్కు వేలకు వేలు ఖర్చు చేసి ఊరేగింపు నిర్వహించాడు. దీంతో ఆ గ్రామస్తులంతా అవాక్కయ్యారు. కారణం తెలిస్తే మీరు కూడా అవాక్కవుతారు...
స్మార్ట్ఫోన్కు ఊరేగింపు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది అక్షరాలా నిజం. ఒక్కొక్కరి కోరికలు ఒక్కోలా ఉంటాయి. ఎవరూ చేయని విధంగా చేసి, అందరి నోళ్లలో నానాలని చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రూ.12,500 ఖరీదు చేసే ఫోన్కు వేలకు వేలు ఖర్చు చేసి ఊరేగింపు నిర్వహించాడు. దీంతో ఆ గ్రామస్తులంతా అవాక్కయ్యారు. కారణం తెలిస్తే మీరు కూడా అవాక్కవుతారు.
మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన మురారి కుష్వాహా అనే వ్యక్తి టీస్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇతడికి ఐదేళ్ల కుమార్తె ఉంది. రోజూ స్మార్ట్ఫోన్ కొనివ్వమని అడిగేది. అయితే ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో వాయిదా వేస్తూ వచ్చాడు. అయినా అతడి కుమార్తె.. పదే పదే అడుగుతూ ఉండేది. ‘‘ఎలాగైనా సెల్ కొనిస్తానని, కొనే రోజు గ్రామస్తులంతా గుర్తుంచుకునేలా చేస్తానని’’.. కూతురుకి మాటిచ్చాడు.
జీవితాన్ని మార్చేసిన తొమ్మిది ప్రశ్నలు.. రూ.కోటి ప్యాకేజీతో జాబ్ ఇచ్చేందుకు Amazon అడిగిన ప్రశ్నలివే..!
ఈ క్రమంలో సోమవారం కొంత డబ్బులు సమకూర్చుకుని, మిగతా కొంత రుణం తీసుకుని రూ.12,500 ఖర్చు చేసి స్మార్ట్ఫోన్ కొన్నాడు. ఆ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో గుర్రపు బండిపై ఊరేగింపు నిర్వహించాడు. కూతురుకు సెల్ ఇచ్చి, బండిపై కూర్చోబెట్టాడు. డీజే సౌండ్లు, బ్యాండు వాయిద్యాల మధ్య గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకొచ్చాడు. విషయం తెలిసిన ప్రజలంతా అవాక్కయ్యారు. కూతురిపై అతడు చూపింపిన ప్రేమకు.. అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.