క్రాంతికిరణ్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2022-05-19T06:34:51+05:30 IST

: అమెరికాలోని మిస్సోరిలో రోడ్డు ప్రమాదంలో మృతిచె ందిన విద్యార్థి సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి భౌతికకాయం మం గళవారం రాత్రి స్వగ్రామం నల్లగొండ జిల్లా మిర్యాల గూడ మండలం అన్నారం చేరుకుంది.

క్రాంతికిరణ్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు
నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మిర్యాలగూడ, మే 18: అమెరికాలోని మిస్సోరిలో రోడ్డు ప్రమాదంలో మృతిచె ందిన విద్యార్థి సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి భౌతికకాయం మం గళవారం రాత్రి స్వగ్రామం నల్లగొండ జిల్లా మిర్యాల గూడ మండలం అన్నారం చేరుకుంది. అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్‌రెడ్డి(25) మిస్సోరి సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదివేందుకు 2021లో అమెరికా వెళ్లాడు. ఈ నెల 7వ తేదీ రాత్రి 7.30గంటల సమయంలో (భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.30) సహ విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ సమీపంలో ఉన్న మిత్రులను కలిసేందుకు కారులో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో క్రాంతికిరణ్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్‌ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా, డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న క్రాంతికిరణ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో ఉన్న బంధువులు, స్నేహితులు భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపారు. ఎమ్మెల్యే భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపీపీ నూకల సరళా, దుర్గంపూడి నారాయణరెడ్డి, చిట్టిబాబునాయక్‌, మట్టపల్లి సైదయ్య, కౌన్సిలర్‌ దేశిడి శేఖర్‌రెడ్డి, అర్జున్‌, వివిధ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అశ్రునయనాల మధ్య బుధవారం క్రాంతికిరణ్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. 


ప్రయోజకుడు అవుతాడనుంటే.. విగతజీవిగా వచ్చాడు

అమెరికాలో ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై కుటుంబానికి, గ్రామానికి పేరు తెస్తాడనుకుంటే విగతజీవిగా వస్తాడనుకోలేదని గ్రామస్థులు కన్నీటి పర్యంత మయ్యారు. అమెరికా వెళ్లకముందు తల్లిదండ్రులకు అన్నీ పనుల్లో సహాయపడే వాడని గుర్తుచేసుకుని విలపించారు.


Updated Date - 2022-05-19T06:34:51+05:30 IST