డాక్టర్‌ శ్వేతకు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2022-05-15T06:55:08+05:30 IST

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి గైనకాలజీ విద్యార్థిని, డాక్టర్‌ శ్వేత అంత్యక్రియలు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో శనివారం ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్వేత మృతదేహానికి కడసారి నివాళులు అర్పించారు.

డాక్టర్‌ శ్వేతకు కన్నీటి వీడ్కోలు

తిమ్మాపూర్‌, మే14: నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి గైనకాలజీ విద్యార్థిని, డాక్టర్‌ శ్వేత అంత్యక్రియలు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో శనివారం ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్వేత మృతదేహానికి కడసారి నివాళులు అర్పించారు.  గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు వార్డులో విధుల్లో ఉన్న ఆమె.. అనంతరం విశ్రాంతి గదికి వెళ్లి, నిద్రలోనే చనిపోవడం తల్లిదండ్రులతో పాటు స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది. ‘తమ కూతురు ఆసుపత్రిలో నైట్‌ డ్యూటీ చేసి అలిసి పోయి నిద్ర పోతోందని ఇంకా లేవలేదని, లే అమ్మ’ అంటూ శ్వేత తల్లి కళావతి రోదించడం అక్కడ ఉన్నవారిని కంట నీరు పెట్టించింది. మరో ఆరు నెలల్లో పీజీ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుందనుకున్నామని, ఆమె అకాల మరణం చెందిందని శ్వేత తల్లిదండ్రులు గుర్రం శ్రీనివాస్‌, కళావతి, అన్నా రవి కిరణ్‌ రోదించడంతో వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. 

Updated Date - 2022-05-15T06:55:08+05:30 IST