విండీస్తో మూడో వన్డే.. క్లీన్ స్వీప్కు దగ్గరగా రోహిత్ సేన
ABN , First Publish Date - 2022-02-12T01:14:30+05:30 IST
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లోనూ ఓడిన విండీస్ జట్టుకు
అహ్మదాబాద్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లోనూ ఓడిన విండీస్ జట్టుకు భారత్ చేతిలో వైట్ వాష్ తప్పేలా కనిపించడం లేదు. నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ ఓటమికి చేరువ అవుతుండగా, రోహిత్ సేన విజయం దిశగా దూసుకెళ్తోంది.
భారత జట్టు నిర్దేశించిన 266 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పూరన్ సేన..82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఓటమి నుంచి తప్పించుకోవడం ఆ జట్టుకు దాదాపు అసాధ్యం. కెప్టెన్ పూరన్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ సహచరుల నుంచి సహకారం లభించలేదు. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పూరన్ కూడా అవుట్ కావడంతో భారత విజయం ఖాయమైంది.
ప్రస్తుతం అల్జారీ జోసెఫ్ 3, ఒడియన్ స్మిత్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. విండీస్ విజయం సాధించాలంటే ఇంకా 156 పరుగులు చేయాల్సి ఉంటుంది. భారత్కు మాత్రం మూడు వికెట్లు సరి. చేతిలో ఇంకా 28 ఓవర్లు ఉన్నాయి.