ఆ తర్వాతే ఆసీస్ భరతం పట్టా: సిరాజ్

ABN , First Publish Date - 2021-01-21T23:04:48+05:30 IST

ఆ తర్వాతే ఆసీస్ భరతం పట్టా: సిరాజ్

ఆ తర్వాతే ఆసీస్ భరతం పట్టా: సిరాజ్

హైదరాబాద్: తండ్రి మరణ వార్త తనను కలచివేసిందని టీమిండియా ఆటగాడు సిరాజ్ అన్నారు. నాన్న కలను నెరవేర్చేందుకు పట్టుదలగా ఆడానని ఆయన తెలిపారు. బూమ్రా తనకు మంచి సపోర్ట్ ఇచ్చాడని చెప్పారు. మొటల్లో తాను కూడా ఒత్తిడికి లోనైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆసీస్ భరతం పట్టామని సిరాజ్ తెలిపారు. భారత జట్టు తరపున అత్యుత్తమ ప్రదర్శనే తన లక్ష్యమన్నారు. 


తండ్రికి నివాళులు అర్పించిన సిరాజ్

కాగా ఆసీస్ పర్యటనలో ఉండగా సిరాజ్ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనల కారణంగా తుది వీడ్కోలు పలకడానికి సిరాజ్ భారత్ చేరుకోలేకపోయారు. దీంతో సిరీస్ ముగించుకుని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో  సిరాజ్‌కు  ఘన స్వాగతం లభించింది. క్రీడాభిమానులు, స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. ఇంటికి చేరుకున్న సిరాజ్.. అక్కడి నుంచి తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. 

 

Updated Date - 2021-01-21T23:04:48+05:30 IST