వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా

ABN , First Publish Date - 2022-01-17T22:48:26+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో దారణ పరాభవం ఎదుర్కొన్న భారత జట్టు వన్డే సిరీస్ కోసం

వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా

పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో దారుణ పరాభవం ఎదుర్కొన్న భారత జట్టు వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు పార్ల్‌లోని బోలండ్ పార్క్‌లో ఈ నెల 19, 21 తేదీల్లో జరగనుండగా, 23న జరగనున్న చివరి వన్డేకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానం వేదిక కానుంది. 


రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు నేడు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ కేఎల్ రాహుల్ కుర్రాళ్లతో మాట్లాడుతున్నట్టు ఉన్న ఈ ఫొటోల్లో మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు.   


భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసీద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ. 

Updated Date - 2022-01-17T22:48:26+05:30 IST