ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్ వన్

ABN , First Publish Date - 2021-03-07T21:55:37+05:30 IST

ఇంగ్లండ్‌తో సిరీస్ గెలుపు తరువాత టీమిండియా ఎన్నో గొప్ప రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కూడా టీమిండియా నెంబర్ వన్ ర్యాంకునకు చేరుకుంది. ఇంగ్లండ్‌-టీమిండియా..

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్ వన్

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో సిరీస్ గెలుపు తరువాత టీమిండియా ఎన్నో గొప్ప రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కూడా టీమిండియా నెంబర్ వన్ ర్యాంకునకు చేరుకుంది. ఇంగ్లండ్‌-టీమిండియా మధ్య మొతేరా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన తరువాత ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది. దీని ప్రకారం.. టీమిండియా 122 పాయింట్లతో టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఆ తరువాత న్యూజిల్యాండ్ 118 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 113 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో ర్యాంకులో నిలిచింది. ఇండియా చేతిలో 3-1తో ఓటమిపాలైన ఇంగ్లండ్ 105 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. దాయాది దేశం పాకిస్తాన్ 90 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.



Updated Date - 2021-03-07T21:55:37+05:30 IST