చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్లు

ABN , First Publish Date - 2021-02-25T21:51:18+05:30 IST

మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 145 పరుగులకు ఆలౌట్ అయింది.

చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్లు

అహ్మదాబాద్‌: మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 145 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 99/3తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 46 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(66) హాఫ్ సెంచరీతో రాణించగా.. కోహ్లీ(27), అశ్విన్(17) పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలం అయ్యారు. లీచ్, రూట్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్ల వద్ద సమాధానం లేకపోయింది. రూట్ 5 వికెట్లతో చెలరేగితే.. లీచ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను కోలుకోని దెబ్బకొట్టాడు. దీంతో కోహ్లీసేన 145 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.  

Updated Date - 2021-02-25T21:51:18+05:30 IST