విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల ధర్నా

ABN , First Publish Date - 2021-10-19T18:38:40+05:30 IST

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేపట్టాయి.

విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల ధర్నా

విజయవాడ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమం ప్రారంభించామన్నారు. సీపీఎస్ రద్దు ఇంకా చేయలేదని, పీఆర్సీ, డిఏలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.  


ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగారావు మాట్లాడుతూ సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి ఇంకా చేయలేదన్నారు. 25వేల పోస్టులు ఖాళీలున్నా డీఎస్పీ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యారంగంలో సంస్కరణ అంటే రంగులు వేసి టాయిలెట్లు బాగు చేయడం కాదన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నవంబర్ 2న ఛలో విజయవాడ నిర్వహిస్తామని పాండురంగారావు స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-19T18:38:40+05:30 IST