టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
ABN , First Publish Date - 2021-01-21T03:53:19+05:30 IST
కేజీబీవీ, ఆర్బన్ రెసిడెన్సియల్ స్కూల్ ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బుధవా రం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు రెబ్బెన, వాంకడిలో మండలాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆసిఫాబాద్, జనవరి 20: కేజీబీవీ, ఆర్బన్ రెసిడెన్సియల్ స్కూల్ ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బుధవా రం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు రెబ్బెన, వాంకడిలో మండలాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కేం ద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో ప్లకార్డులను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమా లను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్యూ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందురావు, నాయకులు రమేశ్, నవీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రెబ్బెన: కేజీబీవీ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించా లని మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కార్యక్ర మంలో ఆ సంఘం నాయకులు హేమంత్, ఉపాధ్యాయులు రజిత, బిందు, పుష్ప, జ్యోతి, సరోజ, వర్కర్లు లీల, సుమలత, తిరుపతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి: సమస్యల పరిష్కరించాలని కేజీబీవీ పాఠశాల ఎదుట టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ నాయకులు పాండురంగా, విఠల్, కిరణ్కుమార్, కేజీబీవీ సీఆర్టీలు రైసాకాథున్, విజయలక్ష్మి, స్నేహకు మారి, ప్రసన్న, పార్వతి, నిర్మల, సువర్ణ పాల్గొన్నారు.