ఉపాధ్యాయ పరీక్షల్లో గడియారానికీ అనుమతి లేదు
ABN , First Publish Date - 2022-05-11T18:26:01+05:30 IST
సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్షల అక్రమాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా కుదిపేస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఉపాధ్యాయుల నియామక పరీక్షల
- విద్యాశాఖ నిర్ణయం
బెంగళూరు: సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్షల అక్రమాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా కుదిపేస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఉపాధ్యాయుల నియామక పరీక్షల సమయంలో అక్రమాలకు తావులేని విధంగా పలు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సన్నాహాలు చేస్తున్న విద్యాశాఖ సాంకేతికతను గరిష్టంగా వినియోగించాలని నిర్ణయించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు చేతి గడియారాలను సైతం అనుమతించబోరు. ఈనెల 21, 22 తేదీల లో 15వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకిగాను పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.