ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-02-27T04:55:47+05:30 IST

బేల మం డలంలోని ఎమ్మార్సీ భవనంలో మద్యం తాగి పేకాట ఆడిన ఎంఈవో కోల నర్సింహులుతో పాటు మరో ఐదుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి26 (ఆంధ్రజ్యోతి): బేల మం డలంలోని ఎమ్మార్సీ భవనంలో మద్యం తాగి పేకాట ఆడిన ఎంఈవో కోల నర్సింహులుతో పాటు మరో ఐదుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ‘ఆంధ్రజ్యోతి’ మినీలో ఈ నెల 25న ‘‘గాడితప్పున బడి’’ అనే వార్త కథనం ప్రచురితం కావడంతో స్పందించిన విద్యాశాఖాధికారులు బేల ఎంఈవో కోల నర్సింహులుతో పాటు చప్రాల పీజీహెచ్‌ఎం జీపీ జ్ఞానేశ్వర్‌, ఉపాధ్యాయులు సోనేరావు (బేల), అమృత్‌రావు (కరోని(బి), పి.నర్సింహస్వామి(బాది), దేవ్‌రావ్‌ (సిర్సన్న)లను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తు ఆర్‌జేడీ నుంచి ఆదేశాలు అందాయని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. బేల ఇన్‌చార్జి ఎంఈవోగా శ్రీనివాస్‌, తాంసి, భీంపూర్‌ మండలాల విద్యాశాఖాధికారిగా శ్రీకాంత్‌ను నియమించామని తెలిపారు.  

Updated Date - 2021-02-27T04:55:47+05:30 IST