13 జిల్లాల్లో ‘స్పౌజ్’ బదిలీలు చేపట్టాలి.. ప్లకార్డులతో టీచర్ల నిరసన
ABN , First Publish Date - 2022-01-18T22:38:54+05:30 IST
రాష్ట్రంలో 13 జిల్లాల్లో పలు కారణాలతో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టలేదని ఆయా జిల్లాల టీచర్లు మండిపడ్డారు
పంజాగుట్ట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 13 జిల్లాల్లో పలు కారణాలతో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టలేదని ఆయా జిల్లాల టీచర్లు మండిపడ్డారు. ఉపాధ్యాయ దంపతులు ఒకే ప్రాంతంలో పనిచేసేలా బదిలీలు చేపట్టి తమను ఆదుకోవాలని 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతుల యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఆ యూనియన్ డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఉపాధ్యాయులు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళతారని భావించిన పోలీసులు ప్రెస్క్లబ్ వద్ద భారీగా మోహరించారు. ప్రెస్క్లబ్ నుంచి చాలాసేపటివరకు ఎవరినీ బయటికి వెళ్లనివ్వలేదు. దీంతో ఉపాధ్యాయులు అక్కడే నిరసన తెలిపారు.