టీచర్ల పీఎఫ్‌ స్లిప్పులను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి: ఏపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-05-29T05:29:00+05:30 IST

జిల్లా పరిషత, మండల పరిషత పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సం బంధించిన 2020- 2021 సంవత్సరాలకు చెందిన వార్షిక వివరాల స్లిప్పులను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌ సుందర్‌రెడ్డి డిమాండ్‌ చేవారు.

టీచర్ల పీఎఫ్‌ స్లిప్పులను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి: ఏపీటీఎఫ్‌
వినతి పత్రం అందజేస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

కడప(ఎడ్యుకేషన), మే 28 : జిల్లా పరిషత, మండల పరిషత పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సం బంధించిన 2020- 2021 సంవత్సరాలకు చెందిన వార్షిక వివరాల స్లిప్పులను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌ సుందర్‌రెడ్డి డిమాండ్‌ చేవారు. కడప నగరం జెడ్పీ సీఈవో కార్యాలయంలో శనివారం జెడ్పీ సీఈవో జి.వెంకటరమణరెడ్డిని ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ప్రావిడెంట్‌ ఫండ్‌ వివరాలను ఎప్పటికప్పుడు ఆనలైన్లఓ పొందుపరచాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదన్నారు. జెడ్పీ సీఈవో స్పందిస్తూ ఉప ము ఖ్య కార్యనిర్వాహణాధికారి సంబంధించి సూపరింటెండెంట్‌లను పిలిపించి వారం రోజులలోపు 2020-21 సంవత్సరాల పీఎఫ్‌ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని మిగిలిన సమస్యలను వెంటనే పరిష్కరసిఆ్తమని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర కౌన్సిలర్‌ ఖాదర్బఆషా, జిల్లా ఉపాధ్యక్షులు మల్లిఖార్జునరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు చెంచురెడ్డి, చింతకొమ్మదిన్నె మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డిలతో పాటు కార్యాలయ సూపరింటెండెంట్లు, శ్రీలక్ష్మి, సోమశేఖర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T05:29:00+05:30 IST