ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
ABN , First Publish Date - 2021-04-17T04:44:45+05:30 IST
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఆర్జేడీ కృష్ణారెడ్డి తెలిపారు.
బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్ 16: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఆర్జేడీ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని బాలికల, బాలు ర ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆయన ఉపాధ్యాయుల హాజరును తనిఖీ చేశారు. మధ్యా హ్న భోజనంలో నాణ్యత పాటించాలని, రోజూ పౌష్టికాహారాన్ని అందించాలని ఆయన తెలిపా రు.
అనంతరం నాడు-నేడు పనులను స్వయంగా పరిశీలించారు. కాగా మండలంలో పలు పాఠశాలల్లో జరిగిన నాడు-నేడు పనుల్లో అవినీతి జరిగిందని, విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు సునిల్కుమార్ ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ పుల్లయ్య, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ ఛైర్మన్లు పాల్గొన్నారు.