హెచ్‌ఎంపై ఉపాధ్యాయుల ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-11T05:18:52+05:30 IST

దోసరి రామినాయుడువలస మండల పరిషత్‌ ప్రాథమిక ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అల్లాడ సూర్య ప్రసాదరావుపై అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఎంఈవో రవికి శనివారం ఫిర్యాదు చేశారు.

హెచ్‌ఎంపై ఉపాధ్యాయుల ఫిర్యాదు
ఎంఈవోకు ఫిర్యాదు చేస్తున్న ఉపాధ్యాయులు

రాజాం రూరల్‌ : దోసరి రామినాయుడువలస మండల పరిషత్‌ ప్రాథమిక ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అల్లాడ సూర్య ప్రసాదరావుపై అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు  ఎంఈవో రవికి శనివారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధులకు గైర్హాజరు కావడమే కాకుండా ఉపాధ్యాయులకు అత్యవసర సమయంలో సెలవులు మంజూరు చేయడం లేదని ఉపాధ్యాయులు కె.సూర్యనారాయణ, జి.సీతా రామలింగేశ్వరుడు, ఆర్‌.పద్మావతి, ఎన్‌.ఇందిరా ప్రియదర్శిణి ఫిర్యాదులో పేర్కొన్నారు. మాపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తున్న హెచ్‌ఎంపై విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు. 


Updated Date - 2021-04-11T05:18:52+05:30 IST