25 ప్రభుత్వ స్కూళ్లలో ఒకేసారి ఉద్యోగం.. ఏడాదిలో కోటిపైగా జీతం!

ABN , First Publish Date - 2020-06-06T00:56:22+05:30 IST

ఒకేసారి 25 స్కూళ్లలో ఉద్యోగం చేసి, 13 నెలల్లో రూ.కోటి సంపాదించిందో టీచర్.

25 ప్రభుత్వ స్కూళ్లలో ఒకేసారి ఉద్యోగం.. ఏడాదిలో కోటిపైగా జీతం!

లక్నో: ఒకేసారి 25 ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగం చేసి, 13 నెలల్లో రూ.కోటిపైగా జీతం అందుకుందో టీచర్. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. సదరు ఉపాధ్యాయురాలిపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మెయిన్‌పురికి చెందిన అనామికా శుక్లా అనే టీచర్ ఒకేసారి 25 స్కూళ్లలో ఉద్యోగం చేస్తోందని, తద్వారా 13 నెలల సమయంలో రూ.కోటిపైగా సంపాదించిందని అధికారులు తెలుసుకున్నారు. వివిధ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే వివరాలతో ఆమె టీచర్‌గా జాయిన్ అయింది. టీచర్ల వివరాలతో డేటాబేస్ సృష్టిస్తున్న సమయంలో ఈ అంశం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆమెపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ సంగతి తెలుసుకున్న ఆమె ప్రస్తుతం పరారీలో ఉందని రాష్ట్ర స్కూల్ విద్యా విభాగం డైరెక్టర్ జనరల్ వీకే ఆనంద్ తెలిపారు.

Updated Date - 2020-06-06T00:56:22+05:30 IST