ఆన్లైన్ క్లాస్లో షాకింగ్ సీన్.. టీచర్ షేర్ చేసిన లింక్ చూసి కంగుతిన్న విద్యార్థులు, తల్లిదండ్రులు.. వెంటనే ఫిర్యాదు చేసినా..
ABN , First Publish Date - 2022-01-24T18:34:41+05:30 IST
ప్రస్తుతం కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. రాజస్థాన్లో కరోనా కేసులు ఎక్కువ కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చేసింది. ఆన్లైన్ క్లాస్లకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయ్పూర్లోని సెయింట్ పాల్స్ పాఠశాల యాజమాన్యం కూడా ఆన్లైన్ ద్వారానే తమ విద్యార్థులకు విద్యాభోదన చేస్తోంది. అయితే ఆన్లైన్ క్లాస్ చెబుతున్న టీచర్ చేసిన ఓ పని అందరికీ షాకిచ్చింది.
ఉదయ్పూర్లోని సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ధ్రువ్ కుమార్ గత శనివారం విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠం చెప్పేందుకు స్కూల్ యాప్లో లింక్ పోస్ట్ చేశాడు. అయితే అది పోర్న్ లింక్ కావడం సంచలనంగా మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ వీడియో చూసి షాకయ్యారు. వెంటనే ధ్రువ్ కుమార్కు, స్కూలు యజమాన్యానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పటికే సర్వర్ బ్రేక్ అవడం వలన ఆ లింక్ తొలగించడానికి వీలు కాలేదు.
దాదాపు రెండు గంటల పాటు ఆ వీడియో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత డిలీట్ అయింది. కాగా, సదరు ఉపాధ్యాయుడిపై పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు సాగిస్తున్నారు. కాగా, అది మానవ తప్పిదం మాత్రమేనని స్కూలు యాజమాన్యం సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.