ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-05-19T06:55:53+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకుడు సీహెచ్ రాములు డిమాండ్ చేశారు.
సూర్యాపేట(కలెక్టరేట్), మే 18: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకుడు సీహెచ్ రాములు డిమాండ్ చేశారు. ఉపాఽ ధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. జీవో నెం.317త ఏర్పడిన సీనియారిటీ, స్పెషల్ కేటగిరి, ఉపాధ్యాయ భార్యాభర్తల సమస్యలు పరిష్కరించాలనారు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరస్పర బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలని, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ప్రతీ నెల మొదటి తేదీనే వేతనాలు జమచేయాలని, సప్లమెంటరీ బిల్లులు జాప్యం లేకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అనిల్కుమార్, ముత్తయ్య,లింగయ్య, సోమయ్య,బిక్షం, వెంకటేశ్వరావు, శ్రీనివాస్రెడ్డి, రామనర్సయ్య, దఽశరథరామారావు పాల్గొన్నారు.