పిల్లలొచ్చినా ఉపాధ్యాయుడేరీ?

ABN , First Publish Date - 2021-10-24T06:07:56+05:30 IST

తొట్టంబేడు మండలం పెద్దగుంట పాఠశాల ఉపాధ్యాయుడు తరచూ విధులకు డుమ్మా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

పిల్లలొచ్చినా ఉపాధ్యాయుడేరీ?
తరగతులకు హాజరైన విద్యార్థులు

తొట్టంబేడు, అక్టోబరు 23: మండలంలోని పెద్దగుంట పాఠశాల ఉపాధ్యాయుడు డుమ్మా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఒకటి నుంచి ఐదోతరగతి వరకు చదివే 20 మంది విద్యార్థులకు ఓ టీచర్‌ ఉన్నారు. కాగా, ఈనెల 20న మాత్రమే విధులకు హాజరై ఆ తర్వాత కన్పించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శనివారం కూడా విద్యార్థులు పాఠశాలకు వచ్చినా, ఉపాధ్యాయుడు హాజరు కాలేదు. దీనిపై ఎంఈవో భారతి స్పందిస్తూ.. పెద్దగుంట పాఠశాల ఉపాధ్యాయుడు గతంలోనూ ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవడంపై ఫిర్యాదులు అందాయని గుర్తుచేశారు. ఈమారు డీఈవో దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-24T06:07:56+05:30 IST