ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 12 మంది

ABN , First Publish Date - 2021-02-24T06:48:37+05:30 IST

కాకినాడ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండు జిల్లాల నుంచి మొత్తం 12 మంది నామినేషన్లు దాఖలు చేశా

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 12 మంది

చివరి రోజున ఐదు నామినేషన్లు దాఖలు

కాకినాడ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండు జిల్లాల నుంచి మొత్తం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన యడవిల్లి రామకృష్ణప్రసాద్‌, రాజోలుకు చెందిన బడుగు సాయిబాబా, తాడేపల్లిగూడేనికి చెందిన మోదుగుల బాలనాగేశ్వరరావు, ఉండ్రాజవరానికి చెందిన టి.రవి, కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన పెన్మెత్స వి కృష్ణ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. 


ఎన్నికల పరిశీలకుడిగా శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడిగా ఎస్సీ  కార్పొరేషన్‌ ఎండీ శామ్యుల్‌ ఆనంద్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన కాకినాడ వచ్చి కలెక్టర్‌ మురళీధర్‌  రెడ్డిని కలిశారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. 




Updated Date - 2021-02-24T06:48:37+05:30 IST