చదువు చెప్పాల్సిన ఆ టీచర్ ఎలాంటి పనులు చేస్తున్నాడంటే.. అతడి వేధింపులు తట్టుకోలేక ఏకంగా 15 మంది విద్యార్థినులు..

ABN , First Publish Date - 2021-12-25T20:58:16+05:30 IST

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఆ గురువు కీచకుడిలా మారాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి తరగతి గదిలోనే విద్యార్థినులను వేధించాడు.

చదువు చెప్పాల్సిన ఆ టీచర్ ఎలాంటి పనులు చేస్తున్నాడంటే.. అతడి వేధింపులు తట్టుకోలేక ఏకంగా 15 మంది విద్యార్థినులు..

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఆ గురువు కీచకుడిలా మారాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి తరగతి గదిలోనే విద్యార్థినులను వేధించాడు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది అతడి వేధింపుల బారిన పడ్డారు.. దీంతో వారంతా ఆ ఉపాధ్యాయుడిపై పై అధికారులకు ఫిర్యాదు చేశారు.. వెంటనే స్పందించిన అధికారులు పోలీసులకు, బాలల హక్కుల అధికారులకు విషయం చెప్పారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.   


రామనాథపురం జిల్లాలోని ఓ పాఠశాలలో సైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు.. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తరగతి గదిలో ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడటం, విద్యార్థినులపై చేతులు వేసి నిమరడం, తరచూ ఫోన్‌ చేసి మాట్లాడడం వంటి చేష్టలకు పాల్పడేవాడు. అతడితో పాటు మేథ్స్ టీచర్ కూడా విద్యార్థినులను వేధించేవాడు. చాలా రోజులు వారి ఆగడాలను భరించిన విద్యార్థినులు చివరకు జిల్లా విద్యాశాఖ అధికారికి విషయం చెప్పారు. ఆయన పోలీసులకు, బాలల హక్కుల అధికారులకు ఫిర్యాదు చేశారు. 


రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి సైన్స్ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో టీచర్ గురించి గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులే కాకుండా జిల్లా విద్యా శాఖ, బాలల హక్కుల అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. 

Updated Date - 2021-12-25T20:58:16+05:30 IST