కరోనాతో ఉపాధ్యాయుడి మృతి
ABN , First Publish Date - 2021-04-21T06:52:29+05:30 IST
మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రెడ్డి ప్రసాద్రెడ్డి(52) మంగళవారం తిరుపతిలో కరోనాతో మృతి చెందినట్లు ఎంఈఓ గోపాల్నాయక్ తెలిపారు.
నంబులపూలకుంట, ఏప్రిల్ 20 : మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రెడ్డి ప్రసాద్రెడ్డి(52) మంగళవారం తిరుపతిలో కరోనాతో మృతి చెందినట్లు ఎంఈఓ గోపాల్నాయక్ తెలిపారు. మూడు రోజుల కిందట వైద్యం కోసం తిరుపతికి వెళ్లాడన్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు. అయన మృతికి ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.