ముగిసిన అంతర్‌ జిల్లాల బదిలీ కౌన్సిలింగ్‌

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

ఉపాధ్యాయుల అంతర జిల్లా బదిలీ కౌన్సెలింగ్‌ ఆదివారం డీఈవో కార్యాలయంలో సజావుగా ముగిసింది.

ముగిసిన అంతర్‌ జిల్లాల బదిలీ కౌన్సిలింగ్‌
నియామక ఉత్తర్వులు అందజేస్తున్న డీఈవో పి.శైలజ

గుంటూరు(విద్య), మే 15: ఉపాధ్యాయుల అంతర జిల్లా బదిలీ కౌన్సెలింగ్‌ ఆదివారం డీఈవో కార్యాలయంలో సజావుగా ముగిసింది. కౌన్సెలింగ్‌లో మొత్తం 39 మంది ఉపాఽధ్యాయులకు ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లోని స్కూల్స్‌లో పోస్టింగ్స్‌ ఇచ్చినట్లు డీఈవో పి.శైలజ వెల్లడించారు. అంతర జిల్లా బదిలీల్లో ఒక హెచ్‌ఎంతోపాటు, 15 మంది స్కూల్‌ అసిస్టెంట్స్‌, 23 మంది ఎస్జీటీలు ఉన్నారని తెలిపారు. విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉమాప్రసూన, సూపరింటెండెంట్‌ రాజేశ్వరి, ఉర్దూ డీఐ ఎస్‌కే ఎండీ ఖాసిం, పలు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST