రెండు నెలలైంది

ABN , First Publish Date - 2021-04-13T05:29:26+05:30 IST

మండలంలోని బసలదొడ్డి ఎంపీపీ ఎస్‌.సీ పాఠశాలలో 77 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యావలంటీర్‌ పనిచేస్తున్నారు

రెండు నెలలైంది

  1.  బడికి రాని ఉపాధ్యాయుడు


పెద్దకడబూరు, ఏప్రిల్‌ 12: మండలంలోని బసలదొడ్డి ఎంపీపీ ఎస్‌.సీ పాఠశాలలో 77 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యావలంటీర్‌ పనిచేస్తున్నారు. వీరిలో ఒక ఉపాధ్యాయుడు పాఠశాలకు 2 నెలల నుంచి రావడం లేదు. సోమవారం ఒక ఉపాధ్యాయుడు ఉదయం 9.30 గంటలకు స్కూలుకు వచ్చారు. వాస్తవానికి ఉదయం 7గంటలకే తరగతులు మొదులు కావాలి. 


డీఈవోకు నివేదిక పంపించాం: ఎంఈవో మొహి నుద్దీన్‌

రెండు నెలలుగా రాని ఉపాధ్యాయుడిపై ఇప్పటికి రెండుసార్లు డీఈవో కార్యాలయానికి నివేదిక పంపించాం. ఆలస్యంగా వస్తున్న ఉపాధ్యాయుడికి మెమోలు జారీ చేస్తాం. 

Updated Date - 2021-04-13T05:29:26+05:30 IST