పేపర్‌ కప్పుల్లో టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!

ABN , First Publish Date - 2020-11-09T17:20:13+05:30 IST

పేపర్‌ కప్పుల్లో టీ తాగితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వాడి పడేసే(డిస్పోజబుల్‌) పేపర్‌ కప్పుల్లో మూడుసార్లు 100మి.లీ చొప్పున

పేపర్‌ కప్పుల్లో టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!

న్యూఢిల్లీ, నవంబరు 8: పేపర్‌ కప్పుల్లో టీ తాగితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వాడి పడేసే(డిస్పోజబుల్‌) పేపర్‌ కప్పుల్లో మూడుసార్లు 100మి.లీ చొప్పున టీ తాగడం వల్ల 75వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోని వెళతాయని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకులు తెలిపారు. 80-90 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడి కలిగిన 100మి.లీ ద్రవ పదార్థం ద్వారా దాదాపు 25వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు మనలోకి చేరతాయని చెప్పారు.  

Updated Date - 2020-11-09T17:20:13+05:30 IST