టీడీపీటీఎస్ కార్యదర్శి రఘునాథరావు గుండెపోటుతో మృతి
ABN , First Publish Date - 2020-04-10T07:11:29+05:30 IST
టీడీపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందిమల్ల రఘునాథరావు (57) గుండెపోటుతో మృతి చెందారు.
ఎర్రగడ్డ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందిమల్ల రఘునాథరావు (57) గుండెపోటుతో మృతి చెందారు. ఎర్రగడ్డలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గంలోని కాలంపాడుకు తరలించారు. రఘునాథరావు మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం ప్రకటించారు.