ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉంది : బీకే
ABN , First Publish Date - 2021-10-23T05:32:39+05:30 IST
పెనుకొండ నగర పాలక పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.
పెనుకొండ టౌన, అక్టోబరు 22: పెనుకొండ నగర పాలక పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. నగర పాలకపంచాయతీ పరిధిలోని 20 వార్డులకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామంలో పెనుకొండ పట్టణంలో ఎక్కడేకాని సమస్యలు లేకుండా అభివృద్ధి చేశానన్నారు. అందులో భాగంగానే తాగునీటి సౌకర్యార్థం గొల్లపల్లి రిజర్వాయర్ నుండి పైప్లైన ద్వారా నీటిని తీసుకొచ్చి నీటి సమస్య పరిష్కరించామన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి ఎవరు చేశారన్నది స్థానిక ఓటర్లు గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొక్సంపల్లి రామకృష్ణప్ప, జీవీపీనాయుడు, చిన్నవెంకటరాముడు, సుబ్రమణ్యం, కన్వీనర్ శ్రీరాములు, అత్తర్ఖాదిర్, దాదు, పాలడుగు చంద్ర, తదితరులు పాల్గొన్నారు.