అసెంబ్లీలో జరిగిన సంఘటన తెలుగుజాతికే అవమానం: దాసరి శేషు
ABN , First Publish Date - 2021-11-19T22:50:55+05:30 IST
అసెంబ్లీలో జరిగిన సంఘటన తెలుగుజాతికే అవమానం: దాసరి శేషు
జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి): ఈ రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన తెలుగుజాతికే అవమానమని రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శేషు అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనివిధంగా ప్రజాస్వామ్యంలో దేవాలయం వంటి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భార్యను అత్యంత అవమానకర రీతిలో అవహేళన చేయడం దారుణమని శేషు తెలిపారు. వ్యక్తిగత దూషణలు చేయడం ఇది కేవలం అన్నగారి కుంటుబానికి జరిగిన అవమానమే కాదు తెలుగుజాతికి జరిగిన అవమానమని శేషు మండిపడ్డారు. ఈ చర్యను ప్రతిఒక్కరు ఖండించాలని కోరారు. చంద్రబాబు నాయుడు కళ్ళల్లో నీళ్ళు చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే ఈ ప్రభుత్వ పతనానికి నాంది అని దాసరి శేషు జోస్యం చెప్పారు.