దెందులూరు ఘర్షణలో టీడీపీ, వైసీపీ వర్గాలపై కేసు

ABN , First Publish Date - 2022-06-08T23:56:01+05:30 IST

దెందులూరు ఘర్షణలో టీడీపీ, వైసీపీ వర్గాలపై పోలీసులు కేసు చేశారు. ఆరుగురు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్త రాంబాబు ఫిర్యాదు చేశారు.

దెందులూరు ఘర్షణలో టీడీపీ, వైసీపీ వర్గాలపై కేసు

ఏలూరు: దెందులూరు ఘర్షణలో టీడీపీ, వైసీపీ వర్గాలపై పోలీసులు కేసు చేశారు. ఆరుగురు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్త రాంబాబు ఫిర్యాదు చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత మహేష్‌తో పాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వైసీపీ నేత కామిరెడ్డి నానితో పాటు ఆరుగురిపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలపై కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ మధ్య ఫేస్‌బుక్‌ పోస్టు  వివాదానికి కారణమైంది. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన వ్యక్తిపై ప్రత్యర్థులు దాడికి యత్నించారు.

Updated Date - 2022-06-08T23:56:01+05:30 IST