దారుణం... కుందుర్తిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2020-11-22T03:51:45+05:30 IST
సంతమాగులూరు మండలం కుందుర్తిలో దారుణం జరిగింది. టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు గొడ్డలితో దాడి చేశారు. టీడీపీ ఎంపీటీసి అభ్యర్థి బొమ్మినేని కృష్ణయ్య..
ప్రకాశం: సంతమాగులూరు మండలం కుందుర్తిలో దారుణం జరిగింది. టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు గొడ్డలితో దాడి చేశారు. టీడీపీ ఎంపీటీసి అభ్యర్థి బొమ్మినేని కృష్ణయ్య, గోరంట్ల వీరస్వామిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. బాధితులకు నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు చికిత్స అందిస్తున్నారు.