టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-10-06T22:56:53+05:30 IST
టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. బోటులో హెరాయిన్ పెట్టి తగులబెట్టారని టీడీపీ నేతల అసత్య ఆరోపణలు అంటూ...
కాకినాడ: టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. బోటులో హెరాయిన్ పెట్టి తగులబెట్టారని టీడీపీ నేతల అసత్య ఆరోపణలు అంటూ వైసీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత పట్టాభి, ఇతర నేతలపై వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.