స్థానిక ఎన్నికల్లో టీడీపీదే విజయం కావాలి
ABN , First Publish Date - 2021-01-25T06:39:16+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అనిత
ఎస్.రాయవరం, జనవరి 24 : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పెనుగొల్లులో నిర్వహించిన టీడీపీ మండల నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో రెండేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. సీఎం జగన్ చాలా ఆలోచనాపరుడని, రేషన్కార్డు వుంటే సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలన్న ఉద్దేశంతో ఎంతో మంది పేదల కార్డులు తొలగించాడని ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను గ్రామ టీడీపీ నాయకులంతా ఏకాభిప్రాయంతో చేపట్టి గెలిపించుకోవాలన్నారు. మాజీ ఎంపీపీ ఏజెర్ల వినోద్రాజు, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు నల్లపరాజు వెంకట్రాజు మాట్లాడుతూ మండలంలోని 28 పంచాయతీలకు గాను 20కి పైగా పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులే విజయం సాధిస్తారని చెప్పారు. పార్టీ నాయకులు తుంపాల నాగేశ్వరరావు, మాతా గుర్నాథరావు, గుర్రం రామకృష్ణ, కోన అప్పలరాజు, అల్లు నర్సింహమూర్తి, బొట్టా వరహాలు, వంగలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.