వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యం
ABN , First Publish Date - 2022-05-18T04:59:33+05:30 IST
రాబోయో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని టీడీపీ 10వ వార్డు ఇన్చార్జి సయ్యద్ ఖాదర్ బాషా, మాజీ ఎంపీటీసీ ఇర్రి నోటిరెడ్డి అన్నారు.
సభ్యత్వ నమోదు చేయిస్తున్న టీడీపీ నాయకులు
పామూరు, మే 17 : రాబోయో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని టీడీపీ 10వ వార్డు ఇన్చార్జి సయ్యద్ ఖాదర్ బాషా, మాజీ ఎంపీటీసీ ఇర్రి నోటిరెడ్డి అన్నారు. పట్టణంలో తూ ర్పువీధి, సీఎస్పురం రోడ్డు, కం భాలదిన్నె గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళ వారం చేపట్టారు. అన్నివర్గాల ప్ర జల నుంచి సభ్యత్వ నమోదుకు స్పందన లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐ-టీడీపీ కోఆర్డినేటర్ ఫత్తు మస్తాన్, శీలం రమేష్, చాపల్లి ప్రసాద్, వెలుగు శ్రీను, షేక్ నాగూర్ అహమ్మద్, ఆసిఫ్, పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి గుత్తి మహేష్ పాల్గొన్నారు. కంభాలదిన్నె గ్రామంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మన్నం రమణయ్య, నియోజకవర్గ మహి ళా ఉపాధ్యక్షురాలు సుబ్బమ్మ, మండల మహిళా కార్యదర్శి జయమ్మ, కోట పాటి మాలకొండరాయుడు, మార్నేని కామేశ్వరరావు, చినపుల్లయ్య, కుక్క పల్లి రమణమ్మ, కోవిరాములమ్మ, పొన్నగంటి కొండమ్మ, హైమావతి, కోఆర్డినేటర్ కోటపాటి రామ్మోహన్ పాల్గొన్నారు.