వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం
ABN , First Publish Date - 2022-06-27T06:12:35+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి
పూసర్లపాడు (గార), జూన్ 26: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పూసర్లపాడు గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. స్థానిక కార్యకర్తలు, అభిమానులు, మహిళలు యువత స్వాగతం పలికి హారతులు పట్టారు. అనంతరం పంచాయతీ ఉపసర్పంచ్, మండల తెలుగుదేశం నాయకుడు అరవల పెద్దబాబు స్వగృహం వద్ద గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరగా వారందరికీ ఆమె టీడీపీ కండువాలను వేసి ఆహ్వానించారు. అక్కడి నుంచి గ్రామంలో ఇంటింటికీ వెళ్తూ స్థానికులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎల్.రాధాకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్, ఉపాధ్యక్షుడు వెలమల శ్రీనివాసరావు, వాణిజ్యవిభాగం ప్రధాన కార్యదర్శి పొట్నూరు కృష్ణమూర్తి, మండలం తెలుగు యువత అధ్యక్షుడు మళ్ల నర్సింగరావు, నాయకులు మళ్ల అబ్బాయినాయుడు, గంగు ప్రభాకరరావు, పొట్నూరు వైకుంఠరావు, తదితరులు పాల్గొన్నారు.